యూపీ కాస్గంజ్ జిల్లా ధోల్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో తాజాగా అమానవీయ ఘటన జరిగింది. దొంగతనం చేశారనే అనుమానంతో ఇద్దరు పిల్లలకు తాలిబాన్ తరహాలో గ్రామపెద్దలు శిక్ష విధించారు. పిల్లలకు సగం గుండు చేసి, అర్ధనగ్నంగా ఊరేగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పిల్లలకు శిక్ష వేసిన వారిపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. దీనిపై పోలీసులు స్పందించారు. ఈ ఘటనలో ఓ దుకాణదారుడిని అదుపులోకి తీసుకున్నారు.