తిరుమల లడ్డూ వ్యవహారంపై స్పందించిన పవన్ కళ్యాణ్

63చూసినవారు
తిరుమల లడ్డూ వ్యవహారంపై స్పందించిన పవన్ కళ్యాణ్
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలపడం బాధాకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ‘వైసీపీ హయాంలో పనిచేసిన టీటీడీ ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. కల్తీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. దేవాలయాల సమస్యలను పరిశీలించేలా జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటు చేయాలి. అప్పుడే సనాతన ధర్మాన్ని కాపాడుకోగలం. దీని కోసం ప్రజలంతా కలిసిరావాలి.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్