స్విట్జర్లాండ్‌లో శాంతి శిఖరాగ్ర సమావేశం

83చూసినవారు
స్విట్జర్లాండ్‌లో శాంతి శిఖరాగ్ర సమావేశం
స్విట్జర్లాండ్‌లో జరిగే గ్లోబల్ పీస్ సమ్మిట్‌లో భారత్ పాల్గొంటుందని విదేశాంగ కార్యదర్శి క్వాత్రా తెలిపారు. జూన్ 15-16 తేదీల్లో జరిగే ఉక్రెయిన్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి స్విట్జర్లాండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. స్విట్జర్లాండ్‌లోని లూసర్న్ సరస్సుపై ఉన్న బర్గెన్‌స్టాక్ హోటల్‌లో ఈ సదస్సు జరుగుతుంది. భారతదేశం సముచిత స్థాయిలో శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటుందని క్వాత్రా చెప్పారు. కాగా, దాదాపు 107 దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ఈ సదస్సులో పాల్గొననున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్