వరుసగా మూడోసారి ఎవరూ ప్రధాని కాలేదు: రాజ్‌నాథ్‌సింగ్‌

84చూసినవారు
వరుసగా మూడోసారి ఎవరూ ప్రధాని కాలేదు: రాజ్‌నాథ్‌సింగ్‌
పార్లమెంట్ హౌస్‌లో ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఎన్డీఏ నుంచి కొత్తగా ఎన్నికైన ఎంపీలు పార్లమెంట్ హౌస్‌లో ఉన్నారు. ఈ క్రమంలో రాజ్‌నాథ్‌సింగ్‌ మాట్లాడుతూ.. 1962 తర్వాత వరుసగా మూడోసారి ఎవరూ ప్రధాని కాలేదన్నారు. మోదీ దూరదృష్టిని దేశ ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. పదేళ్లపాటు ఎన్డీయే ప్రభుత్వం దేశానికి సేవలందించింది. ప్రపంచ దేశాల నేతలు మోదీని ప్రశంసిస్తున్నారని మోడీపై ప్రశంసలు కురిపించారు.

సంబంధిత పోస్ట్