కరీంనగర్ బీఆర్ఎస్ కదనభేరీ సభలో మాజీ ముఖ్యమంత్రి
కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హామీల
గురించి అడిగితే సీఎం రేవంత్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని
కేసీఆర్ అన్నారు. ప్రజలు మీకు అధికారం ఇచ్చారని మాకు ఈర్ష్య లేదని అన్నారు. రైతు బంధు వేయడం
కాంగ్రెస్ కు చేతకాలేదని
కేసీఆర్ విమర్శించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు దురుసుగా ప్రవర్తించలేదని
కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజలు మోసపోయి
కాంగ్రెస్ ను గెలిపించారని అన్నారు.