తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిఐ గట్టుమల్లు విచారణ ముగిసింది. గురువారం అర్ధరాత్రి వరకు ఆయనను దర్యాప్తు బృందం విచారించింది. ఈ సందర్భంగా ఆయన పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఆదేశాలతో పనిచేసినట్లు గట్టుమల్లు చెప్పినట్లు సమాచారం.