5 ఏళ్ల బాలికపై అత్యాచారం ఆపై హత్య

80చూసినవారు
5 ఏళ్ల బాలికపై అత్యాచారం ఆపై హత్య
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. బవానా ప్రాంతంలో ఐదేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. హత్యానంతరం ఆ వ్యక్తి బాలిక మృతదేహాన్ని ఒక ఫ్యాక్టరీలో దాచిపెట్టాడు. ఈ ఘటన మార్చి 24న జరిగినట్లుగా తెలుస్తోంది. పోలీసులు బాలిక మృతదేహాన్ని తాజాగా స్వాధీనం చేసుకుని సమీపంలోని ఆసుపత్రి మార్చురీకి తరలించారు. నిందితుడు ఆ బాలికను ప్రలోభ పెట్టి తనతో తీసుకువెళ్లాడని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్