పవన్ కళ్యాణ్‌పై కోర్టులో పిల్

72చూసినవారు
పవన్ కళ్యాణ్‌పై కోర్టులో పిల్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని హైదరాబాద్ నాంపల్లి కోర్టులో పిల్ దాఖలైంది. తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిశాయని వ్యాఖ్యానించారని, వాటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని న్యాయవాది రామారావు పిల్ వేశారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా పవన్‌కు నిషేధ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. దీనిపై మంగళవారం కోర్టులో విచారణ జరగనుంది.

సంబంధిత పోస్ట్