అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దేశవ్యాప్తంగా రామ భక్తులు సంబరాలు చేసుకున్నారు. ప్రాణప్రతిష్ట వేళ.. ముంబైలో కొందరు యువకులు బైక్పై ర్యాలీగా వెళ్తూ ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. మీరా రోడ్డుపై వీరంగం సృష్టించారు. దాంతో బైక్పై ర్యాలీగా వెళ్తున్న యువకులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలో యువకులు బైక్లను రోడ్డుపైనే వదిలేసి పారిపోయారు.