విషం తాగి సూసైడ్ చేసుకోవాలనుకున్న 28 ఏళ్ల వ్యక్తిని గంటలోనే కాపాడిన పోలీసులు

567చూసినవారు
విషం తాగి సూసైడ్ చేసుకోవాలనుకున్న 28 ఏళ్ల వ్యక్తిని గంటలోనే కాపాడిన పోలీసులు
బావమరిదికి ఫోన్ చేసి చనిపోతున్నానని చెప్పి విషం తాగిన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు గంట వ్యవధిలోనే గుర్తించి ప్రాణాలు కాపాడరు. ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసే జగద్గిరిగుట్టకు చెందిన బాబీ (28) ఉద్యోగానికి వెళ్తున్నానని ఇంట్లో నుంచి వెళ్లాడు. ఆ తర్వాత లాడ్జిలోకి వెళ్లి దోమల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఫోన్ సిగ్నల్ ఆధారంగా గంటలోనే ఆచూకీ గుర్తించి ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్