లోక్సభ ఎన్నికల సందర్భంగా ఏదో ఒక సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు ఒడిశాలో ఎన్నికల అధికారులు వినూత్న పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పూరీ జిల్లా కాకతాపూర్లోని పోలింగ్ బూత్ను తమలపాకులతో అలంకరించారు. పచ్చని ఆకులతో నిండిన ఆ పోలింగ్ కేంద్రం ఆకట్టుకుంటోంది. ఓటు వేసిన అనంతరం ఫొటో తీసుకోవడానికి వీలుగా పోలింగ్ కేంద్రం బయట ఫొటో పాయింట్నూ అందంగా ముస్తాబు చేశారు. ఒడిశాలోని 42 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది.