కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన పోసాని(వీడియో)

73చూసినవారు
సమంత, నాగచైతన్య విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జెంటిల్‌మెన్ నాగార్జున కుటుంబానికి కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కొండా సురేఖ తనకు ముప్పై ఏళ్లుగా తెలుసునని, ఆమె మంచి మనిషి అని అన్నారు. కానీ నాగార్జునపై ఎందుకు నోరు జారారో తెలియదన్నారు. నటి రకుల్ ప్రీత్ సింగ్‌కు గురించి సురేఖ మాట్లాడటం సరికాదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్