ఎస్ఈ మాట్లాడుతుండగా పవర్ కట్.. తొండ కారణమన్న అధికారులు (వీడియో)

538చూసినవారు
తెలంగాణలోని జగిత్యాల జెడ్పి సమావేశంలో విద్యుత్ శాఖ SE సత్యనారాయణ మాట్లాడుతుండగా కరెంట్ పోయింది. ప్రసంగం చివరలో ఏమైనా ప్రశ్నలుంటే అడగాలని కోరగా 'కరెంటే లేదు ఇంకేం అడగమంటారు' అని సభలో ఉన్న వారు సమాధానం ఇచ్చారు. కాగా విద్యుత్ లైన్ పై తొండ పడటంతోనే పవర్ పోయిందని.. ఆ తర్వాత 1.37 నిమిషాల్లో విద్యుత్ సరఫరా అందించామని TGNPDCL వెల్లడించింది.

సంబంధిత పోస్ట్