ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతానికి వెళ్లిన ఓ ఇన్ప్లూయెన్సర్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఆర్య వోరా తన కాబోయే భర్తతో కలిసి హిమాచల్ ప్రదేశ్లో మంచు కురిసే ప్రాంతానికి చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఉష్ణోగ్రత -22 డిగ్రీల సెంటీగ్రేడ్గా ఉంది. దీంతో ఆమె హైపోథెర్మియాకు గురయ్యారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.