ప్రధాని మోదీ యూపీలోని వారణాసిలో గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కాశీలో గంగా హారతిని వీక్షించడం అద్భుతమైన అనుభవం అని ట్వీట్ చేశారు. అక్కడి పవిత్రమైన గంగానది, దీపాల వెలుగులు, భక్తి పారవశ్యం ఎంతో ప్రత్యేకమైనవని పేర్కొన్నారు. అంతకుముందు వారణాసిలో పీఎం కిసాన్ 17వ విడత నిధులను మోదీ విడుదల చేశారు.