కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిస్సంకోచంగా ఇచ్చి దేశ సమగ్రతను బలహీనపర్చిందని ప్రధాని మోడీ విమర్శించారు. దీనిపై ఆదివారం ట్వీట్ చేశారు. కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు దివంగత ప్రధాని ఇందిరగాంధీ 1974లో ఇచ్చారు. ఈ విషయం బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై RTI ద్వారా అడగడంతో బయటికొచ్చింది. ఈ దీవి తమిళనాడులోని రామేశ్వరానికి కేవలం 19 కి.మీ.దూరంలో ఉంది.