ఎప్పటికి పేదల పక్షానే ఉంటాం: చంద్రబాబు

56చూసినవారు
ఎప్పటికి పేదల పక్షానే ఉంటాం: చంద్రబాబు
టీడీపీ ఎప్పటికైనా పేదల పక్షానే ఉంటుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాట్లాడుతూ.. తన పేరుతో వైసీపీ నేతలు లేఖ రాసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీతో తాత్కాలిక పొత్తు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలను గుండెల్లో పెట్టుకునే పార్టీ టీడీపీ అని హర్షం వ్యక్తం చేశారు. ఈ సారి ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్