జైలు నుంచి తప్పించుకున్న ఖైదీలు (వీడియో)

55చూసినవారు
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లో జరిగిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ముజఫరాబాద్‌కు 110 కిలోమీటర్ల దూరంలోని రావల్‌కోట్ నగరంలోని జైలులో అనూహ్య ఘటన జరిగింది. జైలు నుంచి 20 మంది ఉగ్రవాదులు తప్పించుకున్నారు. ఖైదీలను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది చనిపోయాడు. ప్రస్తుతం తప్పించుకున్న 19 మంది ఉగ్రవాదుల జాడ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్