గన్‌పార్క్‌కు ప్రొఫెసర్‌ సాయిబాబా పార్థివదేహం.. ఉద్రిక్తత (వీడియో)

52చూసినవారు
నిమ్స్‌ ఆస్పత్రి నుంచి ప్రొ.గోకరకొండ సాయిబాబా భౌతికకాయాన్ని హైదరాబాద్ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ఉంచడానికి కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. అయితే ఆయన పార్థివ దేహాన్ని అమరవీరుల స్తూపం వద్ద పెట్టకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై సాయిబాబా అభిమానులు, పౌరహక్కుల నేతలు మండిపడుతున్నారు. కాగా, ఇక్కడి నుంచి సాయిబాబా భౌతికకాయాన్ని మౌలాలిలోని నివాసానికి తరలిస్తారు.

సంబంధిత పోస్ట్