విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం తన లోక్సభ ప్రసంగంలో ఎక్కడా హిందువులను అవమానించలేదని ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. తాను బీజేపీతో పాటు ఆ పార్టీ నేతల తీరు గురించే మాట్లాడానని రాహుల్ స్పష్టంగా చెప్పారని ఆమె గుర్తుచేశారు. ఈ మేరకు పార్లమెంట్ వెలుపల ప్రియాంక గాంధీ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బీజేపీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.