ఐపీఎల్ ఫైనల్‌కి వర్షం ముప్పు

82చూసినవారు
ఐపీఎల్ ఫైనల్‌కి వర్షం ముప్పు
ఐపీఎల్ టైటిల్ కోసం రేపు కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు చెన్నై వేదికగా తలపడనున్నాయి. చెపాక్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుండగా.. వర్షం ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే బంగాళాఖాతంలో రేమాల్ తుపాను ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో చెన్నైలో వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. అయితే ఒకవేళ మ్యాచ్ జరుగకపోతే రిజర్వ్ డే రోజున మ్యాచ్ నిర్వహిస్తారు.