అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు

583చూసినవారు
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై నాగోలు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలం, కుత్బుల్లాపూర్ కు చెందిన మల్లికార్జున సోమవారం తన కిరాణా దుకాణంలో మద్యం విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు కిరాణా దుకాణంపై దాడి చేసి 13 బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అతడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :