పోలిసులను అభినందించిన రాచకొండ కమిషనర్

981చూసినవారు
పోలిసులను అభినందించిన రాచకొండ కమిషనర్
చైన్ స్నాచర్ల మీద కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ హెచ్చరించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో మే 23 వ తేదీన జరిగిన బైక్ దొంగతనం కేసులో నిందితులను వెంటనే పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ తిరుపతయ్య, HG జగన్ అదేవిధంగా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మే 24వ తేదీన జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో తక్షణమే స్పందించి నిందితులను పట్టుకుని కేసును పరిష్కరించిన కానిస్టేబుల్ పి. కృష్ణ మరియు HG సంతోష్ లను రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఐపిఎస్ గురువారం నాడు ఎల్ బి నగర్ లోని తన క్యాంపు కార్యాలయంలో అభినందించి రివార్డులు అందజేశారు. బైక్ దొంగతనాలకు పాల్పడే వారి మీద మరియు చైన్ స్నాచర్ల మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్