కన్నుల పండువగా సమతా కుంభ్‌ ఉత్సవాలు..!!

369చూసినవారు
కన్నుల పండువగా సమతా కుంభ్‌ ఉత్సవాలు..!!
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌ శ్రీరామనగరంలో సమతా కుంభ్‌-2023 ఉత్సవాలు శనివారం కన్నుల పండుగగా కొనసాగుతున్నట్లు తెలియజేశారు. ఈ ఉత్సవాలకు భక్తులు పెద్దఎత్తున కుటుంబ సమేతంగా తరలి వచ్చారు. వారిని ఉద్దేశించి చిన జీయర్‌ స్వామి ప్రవచించారు. వెయ్యేళ్ల క్రితమే అట్టడుగు వర్గాల వారికి మార్గదర్శనం చేసిన భగవద్రామానుజాచార్యుల ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ భగవంతుడితో అనుబంధం పెంచుకుంటేనేే జీవితం సాఫీగా సాగుతుందన్నారు.

ట్యాగ్స్ :