బోగస్ కార్డుల ఏరివేతకు చేపట్టిన రేషన్కార్డు కేవైసీ ప్రక్రియకు గడువు సమీపిస్తోంది. ఈ నెల 31 వరకు గడువు ఉండగా మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా మినహా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఈ రెండు జిల్లాల్లో కలిపి 20- 30శాతం మేర కార్డుదారులు ఈకేవైసీ చేయించుకున్నారని శనివారం స్థానిక మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో అధికారులు పేర్కొన్నారు.