తమిళనాడులో ర్యాట్ ఫీవర్ కలవరం

85చూసినవారు
తమిళనాడులో ర్యాట్ ఫీవర్ కలవరం
తమిళనాడులో ర్యాట్ ఫీవర్ కలవరం రేపుతోంది. కళ్లకురిచ్చి జిల్లా వడతోరసలూరు గ్రామంలో ఏడుగురికి ఈ ర్యాట్ ఫీవర్ వ్యాపించింది. అందులో బాలికలు సైతం ఉన్నారు. బాధితులంతా వాంతులు, ఇతర అనారోగ్య సమస్యలతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. వారిని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పించారు. దీనిపై ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి, ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్