సీఎం రేవంత్ పాలన ఎలా చేయాలో నేర్చుకోవాలని కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని.. ఇకపై ఉంటానని చెప్పారు. 'దళితుడిగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. రేవంత్ సీఎం అవుతాడని చెప్పింది నేనే.. మొదటిగా సీఎం మమ్మల్నే రోడ్డున పడేశారు. మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. 6 గంటలు సెక్రటేరియట్లో కూర్చున్న సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇన్నేళ్ల నా రాజకీయ జీవితంలో ఇంత అవమానం ఎక్కడ జరగలేదు' అని అన్నారు.