గుజరాత్లోని అహ్మదాబాద్లో అల్లరి మూకలు విధ్వంసం సృష్టించాయి. శుక్రవారం అర్థరాత్రి సమయంలో శశ్వత్ సొసైటీ సమీపంలోని ప్రాంతంలో పలువురు యువకులు కర్రలు, కత్తులతో స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. ఓ కారు వెళ్తుండగా ఆపి అందులో వెళ్తున్న వారిపై అలాగే అడ్డువచ్చిన వారిపై కత్తులతో దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు 11 మంది నిందితులను అదుపులోకి తీసుకెళ్లారు.