విజయనగరం జిల్లా వంగర మండలం రాజులగుమ్మడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా బస్సు-ఆటో ఢీకొనడంతో 10 మంది కూలీలకు తీవ్రగాయాలు అయ్యాయి. వీరిని రాజాంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాధితులు రాజాం మండలం శివం గ్రామానికి చెందిన రైతు కూలీలుగా గుర్తించారు.