ఆడపిల్లలు వద్దనుకుని అబార్షన్లు చేయించడం మూలంగా ఆడ, మగ నిష్పత్తి దెబ్బతింటోంది. ఆడపిల్లల సంఖ్య ప్రతి ఏడాది తగ్గిపోతుండడంతో ఇప్పటికే చాలామంది యువకులకు పెళ్లి కావడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్ మరింత భయంకరంగా మారే అవకాశాలున్నాయి. అధికారులు స్పందించి స్కానింగ్ సెంటర్లపై నిఘా పెంచడంతోపాటు ఆడపిల్లలపై వివక్ష అంతానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.