టీమిండియా మాజీ క్రికెటర్ కు రోడ్డుప్రమాదం

330056చూసినవారు
టీమిండియా మాజీ క్రికెటర్ కు రోడ్డుప్రమాదం
టీమిండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మంగళవారం రాత్రి యూపీలోని పాండవ్ నగర్ నుంచి మీరట్ కు తన కుమారుడితో కలిసి ల్యాండ్ రోవర్ కారులో ప్రయాణిస్తుండగా, మీరట్ లోని కమిషనర్ బంగ్లా వద్ద ఓ ట్రక్కు వారి కారును ఢీకొట్టింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జవ్వగా, ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో ప్రవీణ్, అతని కుమారుడు సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు ట్రక్కు డ్రైవర్ ను అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్