టీ20 వరల్డ్కప్లో ఆదివారం న్యూయార్క్లో భారత్, పాక్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ కీలక మ్యాచ్కు భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఓపెనింగ్ చేయనున్నారు. భారత్ తొలి మ్యాచ్లో ఆడిన టీమ్తోనే మరోసారి బరిలోకి దిగింది. రెగ్యులర్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ను ఈ మ్యాచ్లో కూడా బెంచ్కే పరిమితం చేశారు. ఆల్రౌండర్ శివమ్ దూబే జట్టులో చోటు దక్కించుకున్నాడు.