ఉప్పల్ స్టేడియంలో
భారత్-ఇంగ్లాండ్ తొలి రోజు మ్యాచ్లో సెక్యూరిటీ కళ్లు గప్పి గ్రౌండ్లోకి దూసుకెళ్లి రోహిత్ శర్మ కాళ్లు మొక్కిన హర్షిత్ రెడ్డి(20)ని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. అతనికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే, ఈ ఘటనను పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. స్టేడియంలో సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. ప్రేక్షకులు వారికి కేటాయించిన సీట్లలోనే కూర్చోవాలని హెచ్చరిస్తున్నారు.