అందరికీ రూ.2 లక్షలు రుణమాఫీ చేయాలి: హరీశ్ రావు (వీడియో)

61చూసినవారు
భూమి లేని నిరుపేద రైతులకు రూ.5 లక్షల రైతు భీమా పత్తా లేకుండా పోయిందని మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రైతులు చేపట్టిన ధర్నాలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దసరాలోపు ప్రభుత్వం రైతుబంధు నిధులు విడుదల చేయాలని.. ఎకరానికి రైతుల ఖాతాల్లో రూ.7,500 జమ చేయాలన్నారు. ఇకనైనా కుంటి సాకులు చెప్పకుండా అందరికీ రూ.2 లక్షలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్