బాలీవుడ్లో భారీ స్థాయిలో ‘రామాయణ్’ చిత్రాన్ని తీయాలని ఎంతో కాలంగా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎలాంటి ప్రకటన లేకుండా ఇటీవల ముంబైలోని ఓ స్టూడియోలో చిత్రీకరణ మొదలైనట్లు ఫొటోలు నెట్టింట వైరలయ్యాయి. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటిస్తున్నారని టాక్ నడుస్తోంది. తాజాగా సీతారాముల గెటప్పుల్లో ఉన్న వారిద్దరి ఫొటోలు నెట్టింట లీక్ అయ్యాయి.