జాతీయ పతాకానికి సెల్యూట్.. నిందితుడికి హైకోర్టు కీలక ఆదేశం

56చూసినవారు
జాతీయ పతాకానికి సెల్యూట్.. నిందితుడికి హైకోర్టు కీలక ఆదేశం
పొరుగుదేశం పాక్ అనుకూల నినాదాలు చేసిన వ్యక్తికి బెయిల్ మంజూరు సందర్భంగా మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అతడిలో దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కేసు విచారణ ముగిసేవరకు పోలీస్‌స్టేషన్‌లో జాతీయ జెండాకు సెల్యూట్ చేయాలని, ‘భారత్ మాతాకీ జై’ అని నినాదాలు చేయాలని ఆదేశించింది. నెలలో రెండుసార్లు ఇలా చేయాలంటూ ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

ట్యాగ్స్ :