ముంబయిలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సిటీని ఇసుక తుఫాన్ చుట్టుముట్టింది. రోడ్లపైన ఉన్నవాళ్లంతా ఈ తుఫాన్ నుంచి తప్పించుకునేందుకు పరుగులు పెట్టారు. ఘట్కోపర్లో చెద్దానగర్ జంక్షన్ వద్ద 100 అడుగుల బిల్బోర్డ్ ఈ ఇసుక తుఫాను ధాటికి కుప్ప కూలిపోయింది. కింద ఉన్న పెట్రోల్ బంక్పై పడిపోయింది.