ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ప్రతాప్ యాదవ్ స్టేజ్పైనే స్వంత పార్టీ కార్యకర్తను కిందకు తోసివేశాడు. పాటలిపుత్ర లోక్సభ స్థానం కోసం ఇవాళ లాలూ కుమార్తె మీసా భారతి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో తేజ్ప్రతాప్ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ పార్టీ కార్యకర్త తేజ్ ప్రతాప్ వద్ద హంగామా చేయడంతో కిందపడేశాడు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.