న్యాల్కల్ మండల కేంద్రంలోని ప్రత్యేక దర్గా ఫీర్ గైబు సాబ్ దర్గాను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్ ఆదివారం సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తనకు బీఆర్ఎస్ నుంచి మెదక్ పార్లమెంట్ స్థానం దక్కాలని ప్రార్ధన చేసినట్లు చెప్పారు. ఆయన వెంట బీసీ సంఘం నాయకులు శివరాజ్ మైనార్టీ నాయకులు కుతుబుద్దిన్, రహీం పాల్గొన్నారు.