దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అరుదైన మైలురాయి సాధించింది. సోమవారం ఎస్బీఐ షేర్లు రాణించడంతో బ్యాంక్ మార్కెట్ విలువ ఒక్కసారిగా రూ.8 లక్షల కోట్లు దాటింది. ఈ ఘనత సాధించిన తొలి ప్రభుత్వరంగ సంస్థ ఎస్బీఐనే కావడం విశేషం. కాగా దేశంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం రాబోతోందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో సోమవారం మార్కెట్లు భారీగా లాభపడ్డాయి.