ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రాముడి ఆలయ ప్రాణప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జనవరి 22న ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రామ జన్మభూమి ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తోంది. అయితే దేశ ప్రజలంతా ఈ వేడుకను ప్రత్యక్షప్రసారం ద్వారా తిలకించేందుకు
బీజేపీ గ్రామాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు అధిష్ఠానం నుంచి ఇప్పటికే గ్రామస్థాయి కార్యకర్తలకు ఆదేశాలు అందాయి.