భారీ వర్షాలకు అస్సాం రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. వరదల కారణంగా చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. బ్రహ్మపుత్ర నది పొంగిపొర్లుతుండటంతో ప్రజలతో పాటు మూగజీవాలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆ వరద నీటిలో ఓ పిల్ల ఏనుగు కొట్టుకొని పోతుండగా ఫారెస్ట్ గార్డులు వల వేసి రక్షించినట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ప్రస్తుతం మానస్ నేషనల్ పార్క్ లో ఏనుగు పునరావాసం పొందుతున్నట్లు తెలియజేస్తూ దానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు.