ఎక్కువ రేట్లకు మద్యం అమ్మతున్నారు: జగన్

61చూసినవారు
ఎక్కువ రేట్లకు మద్యం అమ్మతున్నారు: జగన్
AP: రాష్ట్రంలో మద్యం రేట్లు తగ్గిస్తామని చంద్రబాబు ప్రచారం చేశారని, కానీ ఇప్పుడు ఎమ్మార్పి రేట్ల కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్ముతున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తమ పాలనలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయని ఆయన తెలిపారు. మద్యాన్ని నియంత్రిస్తూనే ఆదాయాన్ని పెంచగలిగామన్నారు. చంద్రబాబు పాలనలో మద్యం ఏరులై పారుతుందని, తన మాఫియా స్రామజ్యానికి మొత్తం మద్యం షాపులను కట్టబెట్టారని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్