ప్రారంభమైన ఏడో విడత ఎన్నికల పోలింగ్

78చూసినవారు
ప్రారంభమైన ఏడో విడత ఎన్నికల పోలింగ్
ఏడో దశలో భాగంగా శనివారం పోలింగ్‌ ప్రారంభమైంది. కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌తోపాటు ఏడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 56 స్థానాలకు ఈ చివరి విడతలో ఓటింగ్‌ జరుగుతోంది. పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాల్లో, ఉత్తర్‌ప్రదేశ్‌లోని 13, పశ్చిమ బెంగాల్‌లోని 9 స్థానాల్లో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఒడిశాలో మిగిలి ఉన్న 42 అసెంబ్లీ స్థానాలకు కూడా నేడు పోలింగ్‌ జరుగుతోంది. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆరు శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలను శనివారమే నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్