ఇటీవల కురుస్తున్న వర్షాలకు దోమలు వృద్ధి చెందుతున్నాయి. పట్టణాల్లో మురుగు కాల్వలను శుభ్రం చేయక దోమలు పెరుగుతున్నాయి. గ్రామాల్లోనూ మురుగు కాల్వల్లో పూడిక పేరుకొని మురుగు నీరు ఎక్కడికక్కడే నిలుస్తోంది. నిల్వ నీటి కారణంగానే దోమలు పెరుగుతున్నాయి. అధికారులు పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు.. తప్పితే విష జ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.