ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

73చూసినవారు
ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం
AP: సరైన పర్యవేక్షణ, నియంత్రణ లేని గ్రామ సచివాలయాలను పంచాయతీల్లో అనుసంధానించడమే సరైన పరిష్కారమని ప్రభుత్వం భావిస్తోంది. సర్పంచులు సైతం ఇదే విధమైన డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనుసంధాన ప్రక్రియను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కొద్దిరోజుల క్రితం ప్రారంభించింది. సచివాలయాలపై సర్పంచులకూ కొన్ని అధికారాలు కల్పించే విషయాన్ని పరిశీలిస్తున్నారు. డీడీవోగా ఉంటున్న పంచాయతీ కార్యదర్శులకు పర్యవేక్షణ బాధ్యత అప్పగించే అవకాశాలున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్