ఎండ తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలు
దుబ్బాక నియోజకవర్గంలో ఎండ తీవ్రత పెరుగుతోంది. ఉదయం నుంచే వేడి తీవ్రత కనిపిస్తోంది. మధ్యాహ్నానికి ఎండ తీవ్రత తారాస్థాయికి చేరుతోంది. కాక పుట్టించే సూర్యకిరణాలు తమ ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈసారి మరింత ఎండలు కాసే అవకాశం ఉంది. పెరుగుతున్న పగటిపూట ఉష్ణోగ్రతలతో ఆదివారం ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు.