రోడ్డు ప్ర‌మాదంలో తల్లికొడుకులు దుర్మరణం

22480చూసినవారు
రోడ్డు ప్ర‌మాదంలో తల్లికొడుకులు దుర్మరణం
చేర్యాల శివారు బురమియాతోట వద్ద ఆదివారం ట్రాక్టర్- ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మృతిచెందిన వారు కూటిగల్ గ్రామానికి చెందిన సిరిమల్ల వసంత (48), సిరిమల్ల రాకేష్ (18)గా గుర్తించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రసవం కోసం సిద్దిపేట ఆసుపత్రిలో చేరిన తన చెల్లెల్ని చూసేందుకు సిరిముల్ల వసంత(45), పెద్ద కుమారుడు రాకేశ్‌(22)తో కలిసి ద్విచక్రవాహనంపై కూటిగల్‌ నుంచి సాయంత్రం బయలుదేరారు. చేర్యాల శివారులోకి రాగానే ఎదురుగా వస్తున్న నర్సాయపల్లికి చెందిన కవ్వం ప్రభాకర్‌రెడ్డి తన సొంత ట్రాక్టరుపై ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఇరువురు ఎదురెదురుగా ఢీకొన్నారు. ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు అక్కడిక్కడే చనిపోయారు. ట్రాక్టరు వెనకాల బిగించిన కేజ్‌వీల్స్‌ వారికి తగలడంతోనే ప్రమాదం జరిగిందని సంఘటన స్థలంలో పరిశీలన బట్టి తెలుస్తోంది. రాకేశ్‌ శిరస్త్రానం పెట్టుకున్నప్పటికీ అది ముక్కలైంది. సంఘటన స్థలానికి సీఐ శ్రీనివాస్‌, ఎస్సై భాస్కర్‌రెడ్డి చేరుకొని పరిశీలించారు. డిగ్రీ పూర్తి చేసిన రాకేశ్‌ వ్యవసాయంలో తండ్రి సత్తయ్యకు సాయం చేస్తున్నాడు. మృతురాలికి భార్త, మరో కుమారుడు, కూతురు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్