సిద్దిపేట నియోజకవర్గం, పట్టణంలోని పారిపల్లి వీధి వెంకటేశ్వర ఆలయంలో వాసవి, యూత్ క్లబ్, వెంకటేశ్వర సేవాసమితి ఆధ్వర్యంలో బుధవారం ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. ఆలయ అర్చకులు వెంకట నరసింహాచార్యుల నేతృత్వంలో కొనసాగింది. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.