ధాన్యానికి రూ. 500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ హామీ అమలుకు నోచుకోవడం లేదని ఓ వైపు యాసంగి ధాన్యం కొనుగోళ్లు మొదలైనా బోనస్పై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా నంగునుర్ మండలం గట్లమల్యాల గ్రామంలో మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశానుసారం ధాన్యం కొనుగోలు కేంద్రంలోని రైతులు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.